Wednesday, May 15, 2024

వీఆర్ఏ కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ – ఎమ్మెల్యే గాదరి

తిరుమలగిరి జూలై 29 ప్రభ న్యూస్ – తరతరాలుగా గ్రామాలలో వెట్టిచాకిరి చేస్తూ గ్రామ సేవకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం సరైన గౌరవం కల్పించి వీఆర్ఏల ను క్రమబద్ధీకరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శనివారం మున్సిపాలిటీ కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో వీఆర్ఏల ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వీఆర్ఏలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ వీఆర్ఏలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement