Thursday, May 2, 2024

NZB: నిరాశ్రయులకు రెడ్ క్రాస్ చేయూత

నిజామాబాద్ సిటీ, జులై 29 (ప్రభ న్యూస్) : నిరాశ్రయులైన కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని గూపన్ పల్లి వాగు పొంగి నిరాశ్రయులైన 60 కుటుంబాలకు వర్ష బాధితులకి రెడ్ క్రాస్ ద్వారా దుప్పట్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సభ్యులు సొంత విరాళాలతో దుప్పట్లు రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా శాఖ ద్వారా పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ… జిల్లాలోని వర్ష బాధితులకు మండల కమిటీల ద్వారా పాక్షికంగా లేదా పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికీ తాటి పత్రిలు ఇస్తామన్నారు. పేదలకు సేవ చేయడమే రెడ్ క్రాస్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు రూరల్ ఎం.ఆర్.ఓ అనిల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీంద ర్, కార్యదర్శి అరుణ్ బాబు, ఈ.సి సభ్యుడు వెంకట కృష్ణ, రూరల్ చైర్మన్ నర్సింహం, వైస్ చైర్మన్ నాగభూషణం, గూపన్ పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement