Sunday, May 5, 2024

ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మ‌హ‌త్య…

ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తీవ్ర‌ విషాధ‌ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో నిన్న రాత్రి భర్తతో గొడవ పడిన భార్య లావణ్య తన పిల్లల‌ను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త చంద్రకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరణం తెలుసుకున్న భార్య లావణ్య కూడా తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఆందోల్ లోని పెద్ద చెరువులో తన ఇద్దరు పిల్లల్ని పడేసి లావణ్య ఆత్మహత్య చేసుకుంది. మరణించిన పిల్లల్లో ప్రథమ్ (8), సర్వజ్ఞ (3) ఉన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణాలకు పాల్పడటం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement