Monday, April 29, 2024

BREAKING: తెలంగాణలో ప్రజాపాలనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన హామీలను పకడ్భందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నలుగురితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్‌గా నియమించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా అపాయింట్ చేసింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీల హామీ ఇచ్చింది.

ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లోని సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటిల్లో డిసెంబర్ 28వ తేదీన నుండి అప్లికేషన్లు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 28వ తేదీ నుండి.. జనవరి 6వ తేదీ వరకు సాగిన దరఖాస్తుల స్వీకరణలో దాదాపు ఒక కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement