Friday, April 26, 2024

కోటికి చేరుకున్న లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ఫాలోవర్లు

బాహుబలి-ఫేమ్ లేడీ సూపర్ స్టార్, అనుష్క శెట్టి భారతదేశం మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ లో తనదైన ముద్ర వేశారు. జూన్ 2021లో కూ లో తన ఆఫీషియల్ ప్రొఫైల్ @msanushkashetty క్రియేట్ చేసినప్పటి నుండి, విపరీతమైన ఫాలోయింగ్ పొందుతూ కేవలం నాలుగు నెలల వ్యవధిలో 1 మిలియన్ ఫాలోవర్ల మార్క్ ను అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారత మహిళా సెలబ్రిటీగా నిలిచింది. ఈసంద‌ర్భంగా కూ ప్రతినిధి మాట్లాడుతూ… అనుష్క త‌మ ప్లాట్‌ఫారమ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్లను చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్లాట్‌ఫారమ్ నిజమైన ఫాలోవర్ గా కనెక్షన్‌లను ఏర్పరచుకోవడానికి భాషాపరమైన అడ్డంకులను అధిగమించే సందేశాన్ని ప్రచారం చేయడంలో కూ కు సహాయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె భావాలను వ్యక్తపరచడంలో టార్చ్ బేరర్ ఉంటున్నారు. ప్లాట్‌ఫారమ్ పై సంకోచం లేకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాము ఆమె మద్దతును అభినందిస్తూ ఆమె మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement