Friday, May 3, 2024

ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అదే

ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదమని టీ.పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడమని ఆయన ఆరోపించారు. నెహ్రూను తక్కువ చేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్‌ను తెరపైకి తీసుకువస్తోందని మండిపడ్డారు. ఒక్క సంతకంతో దేశం మొత్తం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఉత్తమ్ గుర్తు చేశారు. దేశ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ చెప్పుకోవాడనికి చరిత్ర లేదని.. అందుకే మరొకరి చరిత్రను తనదిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ, న్యాయ వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు నాశనం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement