Thursday, May 9, 2024

క్రేన్ వైర్ తెగి ఐదుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం..మృతులంతా బీహార్ కి చెందిన వారు

పంపుహౌస్ లోకి దిగుతుండ‌గా క్రేన్ వైర్ తెగి ఐదుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు..మ‌రొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. కాగా మృతులంతా బిహార్‌కి చెందిన వారిగా గుర్తించారు. కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోని కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మణం చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement