Tuesday, April 30, 2024

ఖమ్మం జిల్లాలో రెండు వేరువేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

ఖమ్మం : – ఖమ్మం జిల్లాలో శనివారం జరిగిన రెండు వేరు వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఖమ్మం చర్చి కాంపౌండ్ బ్రిడ్జిపై వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు యువకులు ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అదేవిధంగా వైరా పట్టణంలో క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ ఢీకొనడంతో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రెండు ప్రమాద సంఘటనలతో ఖమ్మం జిల్లాలో విషాదం అలుముకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement