Tuesday, May 14, 2024

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ: బత్తినిగౌడ్ సోదరులు

బత్తిని సోదరుల చేప మందు పంపిణీ కు ముహుర్తం ఖరారైంది. వచ్చే నెల 8న ఉబ్బసం రోగుల కోసం  చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని 8న ఉదయం 10 గంటల నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని మృగశిర ట్రస్ట్ భవనంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రసాద పంపిణీ రోజంతా కొనసాగుతుందని వివరించారు. ఈ మందును చాలా మంది ప్రసాదంగా భావిస్తారు. దేని కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వశారు. ముఖ్యంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషధంగా చెప్తారు. ప్రతి యేటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement