Thursday, May 2, 2024

TS: విప‌క్షంగా తొలి విజ‌యం ఇదే… కేటీఆర్

కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించలేమంటూ నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న తీర్మాణం ప్రతిక్షంగా ఇదే తొలి గెలుపు అని ఎక్స్ ద్వారా కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుందని ఆయన ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement