Monday, April 29, 2024

Jammu&Kashmir: క‌శ్మీర్‌లో అగ్నిప్ర‌మాదం…ముగ్గురు అక్క చెల్లెల్లు సజీవ‌ద‌హ‌నం…

కశ్మీర్‌లో ఓ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం సంబంధించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు బాలిక‌లు స‌జీవ‌ద‌హ‌న‌మయ్యారు. మృతులు 16 ఏళ్ల సానియా, 14 ఏళ్ల బిస్మా మరియు 12 ఏళ్ల సైకా, తజ్నిహాల్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ లతీఫ్ లోన్ కుమార్తెలుగా గుర్తించారు.

ఉఖ్రాల్ బ్లాక్‌లోని ధన్మస్తా- తజ్నిహాల్ గ్రామంలోని మూడు అంతస్తుల ఇంట్లో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో నిద్రిస్తుండగా.. ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో ఆ ముగ్గురు అక్క చెల్లెల్లు బయటకు రాలేకపోవడంతో దీంతో పూర్తిగా సజీవదహనం అయ్యారు. అయితే, ఇంట్లో మంటలు వ్యాపించాయని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హూటహూటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆ మంటల్లో ముగ్గురు మైనర్ బాలికలు ( అక్కచెల్లెల్లు ) మరణించారు. కాగా, వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement