Monday, April 29, 2024

Breaking: టెక్సో కంపెనీ గోదాంలో ఫైర్‌.. కాలి బూడిదైన బెడ్‌షీట్లు, బ‌ట్ట‌లు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన టేక్సో కంపెనీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది.. పిల్లలకు సంబంధించిన బెడ్‌షీట్లు, క్లాతులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 38 కోట్లు ఆస్తి నష్టం అంచనా వేశారు అధికారులు. సంఘటనా స్థ‌లానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాగా, ఈ ప్ర‌మాదంపై పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలనే అంటిపెట్టి ఉంటారన్న కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గీసుకొండ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement