Sunday, May 5, 2024

నవజీవన్ ఎక్స్‎ప్రెస్ లో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు.. వీడియోతో..

మహబూబాబాద్: నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలు కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చైన్నై వెళ్తున్ననవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.. అప్రమత్తమైన లోకో ఫైల మహబూబాబాద్ స్టేషన్ల లోనే రైల్వే రైలును నిలిపివేశారు. బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలును నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement