Saturday, April 27, 2024

లేడీస్ కార్నర్ లో అగ్నిప్రమాదం..

బిజినేపల్లి (ప్రభా న్యూస్): మండల కేంద్రంలో నేతాజీ చౌరస్తా దగ్గర్లో ఉన్న గౌరిశంకర్ లేడిస్ కార్నర్ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదశావత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దుకాణంలో ఉన్న పర్నీచర్, లేడిస్ కార్నర్ సామాగ్రి పూర్తిగా ద్వంసమైంది. రాత్రి ఒకటి గంట సమయంలో చుట్టు పక్కల వారు తెరుకుని చూసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక యంత్ర వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేసింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ.7 లక్షల వరకు నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది కురుమూర్తి, నాగేష్, మహేష్ లు అంచనా వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement