Saturday, April 27, 2024

Breaking: బైక్‌ను ఢీకొన్న బ‌స్సు… అన్నదమ్ములిద్ద‌రూ మృతి.. ఎక్క‌డంటే..

హనుమకొండ జిల్లాలో ఆదివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ బైక్‌ను ఢీకొట్టడంతో అన్నదమ్ములిద్దరు అక్క‌డిక్క‌డే చ‌నిపోయారు. ఐనవోలు మండలం ఉడతగూడెం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో బస్సు అతివేగంగా వచ్చి వెనకనుండి ఢీకొట్టడంతో ఉడతగూడెం గ్రామానికి చెందిన ఏలీయా (40), కుమార్ (36) అక్కడికక్కడే చ‌నిపోయారు. వీరిద్దరూ అన్నదమ్ములు కావడం, ఒకేసారి చ‌నిపోవ‌డంతో ఆ గ్రామ‌స్తులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. బస్సు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement