Monday, April 29, 2024

Peddapalli: రైతు బాంధవుడు కేసీఆర్.. ఎమ్మెల్యే దాసరి

అసలైన రైతు బాంధవుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… గతంలో మాఫీ చేసిన 19 వేల కోట్ల రూపాయలకు అదనంగా లక్ష రూపాయల రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రకటించి కర్షక లోకానికి ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు.


ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు సాగునీరు, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతాంగానికి అవసరమైన సాగునీటిని అందించడంతోపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రైతు కుటుంబాలన్నీ కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు మాత్రమే ఉంటుందని, రైతులందరూ రేవంత్ రెడ్డి ప్రకటనను మర్చిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్ రెడ్డి, జడ్పిటిసి రామ్మూర్తి, పట్టణ అధ్యక్షులు రాజకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్, బిఅర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement