Wednesday, May 8, 2024

రైతులకు రుణ మాఫీ – గ్రామాలలో కెసిఆర్ చిత్రపటాలకి పాలాభిషేకాలు

హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయమని ఆదేశించారు. రేపటి నుంచి రైతులకు రుణ మాఫీ చెక్కులు విడతల వారీగా అందజేయనున్నారు..

విషయం తెలుసుకున్న రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ధన్యవాదాలు తెలిపారు. అలాగే టపాసులు పేల్చి, స్వీట్లు పంచి ఆనందం వ్యక్త చేసారు చెన్నూరు మండల నాయకులు, రైతులు .

చెన్నూరు లో బిఆర్ఎస్ సంబరాలు

- Advertisement -

:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర రైతాంగానికి లక్ష రూపాయల ఋణ మాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బుదవారం సాయంత్రం బిఆర్ఎస్ నాయకులు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణం లోని ప్రధాన వీధుల్లో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement