Wednesday, May 15, 2024

కౌలు వివాదం …. రైతు హ‌త్య ..

భీంపూర్. కౌలు వివాదం హ‌త్య‌కు దారి తీసిన ఘ‌ట‌న మండలం లోని ఆర్లి టి గ్రామ పంచాయతీ లోని శాంతి నగర్ గ్రామం లో జ‌రిగింది. .పోలీస్ ల , స్థానికుల కథనం ప్రకారం శంతినగర్ గ్రామానికి చెందిన మృతుడు ఆత్రం అంకుష్ 24 తన భూమిని ప్రతి సంవత్సరం నిందితుడు కుంమ్ర బావ్ రావ్ కు కౌలుకి ఇచ్చేవాడు.. అయితే ఈ ఈ సంవత్సరం ఇతరులకు కౌలుకు ఇవ్వడం తో వివాదం జ‌రిగింది.. తనని కాదని భూమిని వేరే వ్యక్తులకు ఇవ్వడం తో వారిద్దరూ మధ్య రాత్రి మాట మాట పెరిగి నిందితుడు బవ్ రావ్ కత్తి తో మృతుడు అంకుష్ ను పొడిచాడు..

దీంతో అంకుష్ రక్తపు మడుగులో ఉన్న అత‌డిని కుటుంబీకులు స్థానికులు అదిలాబాద్ లోని రిమ్స్ కి తరలించారు.. చికిత్స పొందుతూ నేటి ఉద‌యం మ‌ర‌ణించాడు . మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు తండ్రి ఆత్రం రం కిషన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాధిక తెలిపారు. కాగా నిందితుడు బావ్ రావు పోలీసుల‌కు లొంగిపోయాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement