Friday, May 3, 2024

ఇంటర్ సిటీ ట్రైన్ లో ప్రయాణించిన.. మాజీ ఎంపీ..మాజీ మంత్రి

వికారాబాద్ ( ప్రభ న్యూస్): మర్పల్లిలో ఇంటర్ సిటీ ట్రైన్ ను ప్రారంభించారు బిజెపి నాయకులు..
మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ లు ప్రయాణించారు.
మర్పల్లి రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం 8 గంటలకు బీదర్ హైదరాబాదు ఇంటర్ సిటీ ట్రైన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మర్పల్లి నుంచి టికెట్ కొని వారు ట్రైన్ లో ప్రయణించారు..అనంత‌రం వారు మాట్లాడుతూ.. మర్పల్లి మండల ప్రజానీకం కోరిక మేరకు రైల్వే మంత్రికి .. రైల్వే అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం వ‌ల్లే ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మ‌యింద‌న్నారు. ఎంఎంటీఎస్ ట్రేన్స్ కూడా వికారాబాద్ వరకు పోడగించడానికి కేంద్రం సుముఖంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాట చెల్లించని కారణంగానే ఎంఎంటీఎస్ ట్రేన్స్ వికారాబాద్ వరకు రాలేకపోతున్నయని అన్నారు.. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అద్యక్షుడు మల్లేష్ యదవ్, మండల ఇన్ చార్జ్ శ్రీనివాస్ గౌడ్, రామేశ్వర్ రెడ్డి, మహేష్,శ్రీమంత్ కుమర్, క్రీష్నరెడ్డి ,జైపాల్, శ్రీనివాస్,రఘుపతి, లక్ష్మన్న, సంజీవులు , మనోహర్, శ్రీధర్ రెడ్డి ,సంతోష్ రెడ్డి, మధుకర్, యాదగిరి, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement