Monday, April 29, 2024

జూన్‌ 4 నుంచి తెలంగాణ ఇంటర్‌ సప్లీమెంటర్‌ పరీక్షలు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈసారి కూడా ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌లే పై చేయిగా న‌లిచారు. ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెంద‌కుండా మ‌రింత క‌ష్ట‌ప‌డి చ‌దవాల‌ని సూచించారు. జూన్ నాలుగు నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. పిల్లల పై తల్లి దండ్రులు ఒత్తిడి చేయకండని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement