Sunday, April 28, 2024

ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడితే టిఆర్ఎస్ మంత్రులు ఏం చేస్తున్నారు?

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ నది పైన అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ మంత్రులు ఏమి చేస్తున్నారని మాజీ మంత్ఇర నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తాం అని అసెంబ్లీలోనే చెప్పారని తెలిపారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బేసిన్లు లేవు, భేషజాలు లేవు ఏపీ వాళ్ళు కూడా బతకాలి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అవి అక్రమ ప్రాజెక్టులు ప్రజలు అడ్డుకోవాలి పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఏపీలో కడుతున్న అక్రమణ ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement