Friday, May 3, 2024

Election Checking – గ‌చ్చిబౌలిలో రూ.5 కోట్లు ప‌ట్టివేత

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో గచ్చిబౌలి ప్రాంతంలో రూ.5 కోట్లు పట్టుబడ్డాయి. పోలీసులు కట్టుదిట్టంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బొటానికల్ గార్డెన్ నుంచి చిరాగ్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో రూ.5 కోట్లను గుర్తించారు. ఈ నగదును ఓ వ్యాపారవేత్తదిగా గుర్తించారు. పట్టుబడిన నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement