Monday, April 29, 2024

MDK : ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఖ‌ర్గే ఎన్నిక‌ల ప్ర‌చారం

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నిక‌ల ప్ర‌చారం ఇవాళ నిర్వ‌హించ‌నున్నారు. కాంగ్రెస్‌ విజయభేరి రెండో విడత బస్సు యాత్రలో భాగంగాసంగారెడ్డి, మెదక్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన.. నేరుగా సంగారెడ్డికి చేరుకుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ లంచ్‌ను ముగించుకుని హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement