Monday, April 29, 2024

HYD : ఎల్బీనగర్ లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామరంగారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం

ఎల్బీనగర్, నవంబర్ 20 (ప్రధాని న్యూస్) ఎల్బీనగర్ లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి తెలిపారు. వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం సెంట్రల్ క్రిస్టియన్ కాలనీ, నాగార్జున కాలనీలలో పాదయాత్ర ద్వారా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమానికి హాజరైన సామ రంగారెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత పాలన బిజెపితోనే సాధ్యమని ప్రజలు గ్రహించి బిజెపికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. డబల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలే తప్ప అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. భారాస పాలనలో విసిగిపోయిన ప్రజలు బిజెపి వైపు విశ్వాసంతో ఉన్నారని ఎల్బీనగర్‌లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నూతి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కొత్త రవీందర్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, తడకమల్ల విజయ్ కుమార్, అశోక్ కుమార్, వాసు చౌదరి, రేవతి, మాధవి, రోజా, కృష్ణవేణి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement