Tuesday, May 7, 2024

పాల్వంచ‌లో భూకంపం.. ఇళ్ల‌ను వ‌దిలి బ‌య‌టికి ప‌రుగులు తీసిన జ‌నం

పాల్వంచ‌లో భూకంపం వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో భూమి కంపించ‌డంతో పాటు శ‌బ్దాలు కూడా వ‌చ్చాయి. దాంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌ను వ‌దిలి బ‌య‌టికి ప‌రుగులు తీశారు.. ఈ సంఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. ఈ ప్రకంపనలో ఇంట్లోని వస్తువులు కూడా కిందపడిపోయినట్టు స్థానికులు వెల్లడించారు. నేటి మధ్యాహ్నం 2.13 గంటల సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో పాల్వంచలో భయాందోళనకర పరిస్థితి నెలకొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్ర 3.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement