Sunday, April 28, 2024

కొత్త హెలికాఫ్ట‌ర్ ని కొనుగోలు చేసిన ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజ్ ఎండీ.. యాదాద్రిలో పూజ‌లు

తెలంగాణ‌లో యాదాద్రి కొత్త ఆధ్యాత్మిక స‌మ‌గ్ర గ‌మ్య‌స్థానంగా పేరుగావిస్తోంది. ఈ ఆల‌యం పునరుద్ధరణ తర్వాత చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. జంట నగరాల ప్రజలకు దైవిక ఆశీర్వాదాలు పొందడానికి కేవలం ఒక గంట లేదా రెండు గంటల సమయం ఇక్కడి నుంచి దూరం కావడంతో చాలా మంది యాదాద్రికి తరలివస్తున్నారు. కేవలం ప్రజలు .. వారి దర్శనం కోసం మాత్రమే కాకుండా ఫ్యాన్సీ వస్తువుల కోసం కూడా వివిధ రకాల షాపులు వెలువడంతో అందరూ పోటెత్తుతున్నారు.

యాదాద్రిలో వివిధ కొత్త వాహనాలకు పూజా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయట.. ఇదొక ట్రెండ్ గా మారింది. తాజాగా కొత్త హెలికాప్టర్ కు యాదాద్రిలో వాహన పూజ చేయడం వైరల్ గా మారింది. ఈ ఫోటో ..వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ప్రతిమ మెడికల్ కాలేజీ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు కొత్త హెలికాప్టర్ ని .. కొనుగోలు చేసి హిందూ సంప్రదాయంలో భాగంగా దానికి తొలి పూజలు చేయడానికి యాదాద్రికి తీసుకొచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement