Sunday, May 5, 2024

Dubbaka – ఐఓసీ- సమీకృత కార్యాలయ భవన ప్రారంభం

ఉమ్మడి మెదక్ బ్యూరో : సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఐఓసీ- సమీకృత కార్యాలయ భవన సముదాయంను ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావులతో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి స్మరిస్తూ నివాళులు అర్పించారు.

సోలిపేట రామలింగారెడ్డి విగ్రహావిష్కరణ
దుబ్బాక‌లో ఏర్పాటు చేసి దివంగత నేత, స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.ఈ కార్య‌క్ర‌మంలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, తనయుడు సతీశ్, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ బక్కి వెంకన్న, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement