Sunday, April 28, 2024

TS: రక్తదానం మరొకరికి ప్రాణదానం.. పోలీసు శాఖ సేవలు భేష్.. మంత్రి కొప్పుల

పెద్దపల్లి : రక్తదానం మరొకరికి ప్రాణదానం చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలియజేశారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 6006 మంది ఒకేసారి రక్తదానం చేయడం రికార్డు సృష్టించే విషయం అన్నారు. కృత్రిమ గుండెకాయ, శరీర అవయవాలు అన్ని తయారు చేస్తున్నారు.. కానీ రక్తం మాత్రం ఇప్పటికీ తయారు అయ్యే పరిస్థితి లేదన్నారు.

పోలీస్ శాఖ పెద్ద క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో ఇంత పెద్ద రక్తదానం శిబిరం ఇప్పటికీ జరగలేదన్నారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, డిసిపి వైభవ్ గైక్వాడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement