Wednesday, May 8, 2024

తెలంగాణలో మరో కొత్త పార్టీ.. పెట్టేది ఎవరో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ నేతృత్వంలో మరో కొత్త పార్టీ రానుంది. హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో మద్దతుదారులతో వినయ్ భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు. డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును వినయ్‌కుమార్ ప్రకటించనున్నారు. తన స్నేహితుడు డాక్టర్ మిత్ర ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డాక్టర్ పుంజాల వినయ్ తండ్రి శివశంకర్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వినయ్ కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అనేక పార్టీలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల.. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవలే మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీలో చేరారు. తాజాగా ఇప్పుడు మరో పార్టీ ఏర్పాటు కానుండడం ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: పట్టాభికి టీడీపీ అంటేనే భయం: విజయసాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement