Tuesday, May 14, 2024

Dog Attack : కుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు..

నిజామాబాద్ సిటీ, మే 4 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి గాయత్రీ నగర్ లో 12 మంది పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గురువారం నగరంలోని గాయత్రీ నగర్ ప్రాంతంలో కుక్కలు చిన్న, పెద్ద అని తేడా లేకుండా పలువురిపై దాడి చేసి గాయపరిచాయి. గాయత్రీ నగర్ కాలనీ వాసులు ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement