Saturday, April 20, 2024

50వ రోజుకు పీపుల్స్ మార్చ్.. భ‌ట్టి విక్ర‌మార్క‌ పాదయాత్రకు జననీరాజనం..

ప్రభ న్యూస్, యాదాద్రి ప్రతినిధి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు 50వ రోజుకు చేరుకుంది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలోని గొల్లగూడెం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై మగ్గంపల్లి, పెద్ద పలుగు తండా, గుర్రాల దండి, బట్టుగూడెం, పెద్ద రావులపల్లి, గోసుకొండ, రేవనపల్లి, పోచంపల్లి వరకు కొనసాగుతుంది. భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌కు జ‌న‌నీరాజ‌నం ప‌లుకుతున్నారు. పోచంపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం బస చేస్తారు. 50వ రోజు 16 కిలో మీటర్ల మేర కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కోనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement