Sunday, May 12, 2024

ఆర్యవైశ్య చైతన్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ .

ఖమ్మం : నగరంలో పీఎస్సార్ రోడ్డు 3వ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్యవైశ్యలకు సుమారు ఐదు కుటుంబాలకు ఆర్యవైశ్య చైతన్య సంఘం ఆధ్వర్యంలో నెలకు సరిపోయే నిత్యావసర సరుకుల మరియు కూరగాయలను పంపిణీ చేశారు. ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతామని, నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ఉంటామని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆర్యవైశ్య చైతన్య సంఘం నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వీరవెల్లి రాజేష్, నకిరికంటి వీరభద్రం, దేవరశెట్టి వెంకట సతీష్, జూలకంటి సంతోష్, బుద్దా శ్రీకాంత్, బిజ్జాల క్రిష్ణ ప్రసాద్, ఆకుల నరేష్, సుగ్గల గోపి, దేవరశెట్టి బుద్దా వెంకట రామారావు, దేవరశెట్టి అర్చన్ కుమార్, చిన్ని నిఖిల్, ఇరుకుళ్ళ సాయి, చిన్ని గోపి, శబరి, చలపతి వరుణ్, సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement