Thursday, May 2, 2024

సాయిసింధు పిల్లల ఆసుపత్రిలో శిశువు మృతి.. డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణమంటూ ఆందోళ‌న‌

కరీంనగర్ లోని సాయి సింధు పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి ఓ మగ శిశువు మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చొప్పదండి మండలం గుమ్లపూర్ గ్రామానికి చెందిన నీరజరాజ్ కుమార్ దంపతులకు 7 రోజుల క్రితం లైఫ్ లైన్ ఆస్పత్రిలో బాబు జన్మించాడు, బాబు పుట్టిన వెంటనే సీరియస్ గా ఉన్నాడని తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పిల్లల డాక్టర్ సతీష్ రెడ్డి సాయి సింధు పిల్లల ఆస్పత్రికి తరలించాడని తెలిపారు. తమ‌ ఆసుపత్రిలో ఏడు రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నామని తెలుపుతూ లక్ష రూపాయల పైగా వసూలు చేసినట్లు తెలిపారు.

శనివారం మరిన్నీ డబ్బులు కట్టాలని కట్టితేనే ట్రీట్మెంట్ చేస్తామని తెలిపి ట్రీట్మెంట్ నిలిపివేయడంతోనే శిశువు మృతి చెందాడని ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే శిశువు మృతి చెందండని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన పై వివరాలు సేకరించారు. ఏసిపి విజయ్ కుమార్ హాస్పిటల్ లోని ట్రీట్మెంట్ పత్రాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు పంపించారు బాధితులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement