Tuesday, May 14, 2024

Kamareddy: గ‌ణేశుడి నిమజ్జనోత్స‌వంలో అపశ్రుతి.. కరంట్ షాక్​తో వ్యక్తి మృతి

జుక్కల్, (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో విషాద ఘ‌ట‌న జ‌ర‌గింది. వినాయ‌క నిమ‌జ్జ‌నంలో క‌రెంట్ షాక్ కొట్టి ఒక‌రు చ‌నిపోయారు. హాంగర్గ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. శోభా యాత్రలో చురుకుగా పాల్గొన్న పడంపల్లె రాజు (35), ఉరేగింపులో భాగంగా గ్రామంలోని సింగిల్ పేజ్ ట్రాన్స్ఫార్మర్ వ‌ద్ద షాక్‌కి గుర‌య్యాడు.

వర్షం కారణంగా విద్యుత్ ప్రవహించి ప్రమాదవశాత్తు రాజుకు కరంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చ‌నిపోయాడు. ఈ విష‌యాన్ని గిర్దావర్ రామ్ పటేల్ తెలిపారు. మృతుని తండ్రి చిన్న హన్మండ్లు ఫిర్యాదు మేరకు జుక్కల్ పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య, 4 సంవ‌త్స‌రాలు కొడుకు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement