Tuesday, May 14, 2024

మ‌ర్డ‌ర్‌ కేసులో నిందితుడి అరెస్ట్.. భ‌ర్తే అస‌లు హంత‌కుడు..

భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో హత్య వివరాలు వెల్లడించారు. పట్టణంలోని తెనుగు వాడలో నివాసముంటున్న సంధ్యకు దొంగతుర్తి గ్రామానికి చెందిన గణేష్ తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, అయిదేళ్లుగా దుబాయిలో ఉద్యోగం చేసుకుంటున్న గణేష్ రెండు నెలల క్రితం సెలవుపై వచ్చారన్నారు. అప్పటినుండి భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన గొడవలు జరుగుతున్నాయని, దీంతోపాటు భార్యపై రోజురోజుకు ఆనుమానం పెరిగిందన్నారు.

శనివారం సంధ్యను భర్త గణేష్ ఇంట్లోని కత్తి, కత్తెర తో కడుపు, గొంతు, మెడ భాగంలో పొడిచి దారుణంగా హత్య చేశాడన్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, రాజవర్దన్ లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవడం తోపాటు హత్యకు ఉపయోగించిన కత్తుల ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement