Friday, May 3, 2024

మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరమైన వ్యసనం – రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును మాదకద్రవ్యాల వాడకం వలన నిర్వీర్యం చేసుకోవద్దని రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు శుక్రవారం శంకర్పల్లి మండల పరిధిలోని ఇక్ఫాయి బిజినెస్ స్కూల్ లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వాడకం పర్యవసానాలు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు సేవించడం వలన మీ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందని నీ తల్లిదండ్రుల కలలు కలలుగా మిగిలిపోతాయని హెచ్చరించారు . ఒకరు మాదకద్రవ్యాలకు బానిస అయితే వాటికోసం ఆ వ్యక్తి ఎంతటి దౌర్భాగ్య కరమైన పనులను చేయడానికి సిద్ధ మవుతాడ ని ఆయన అన్నారు . మాదక ద్రవ్యాలను సేవించడం వాటిని దగ్గర ఉంచుకోవడం ఇతరులతో పంచుకోవడం చట్ట రిత్యా నేరం అని , వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని అంటూ చదువుపై దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థులకు ఆయన సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement