Tuesday, May 14, 2024

వసతుల కల్పనే ధ్యేయం..పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని 4 మరియు 15 వ వార్డులలో పట్టణ-ప్రగతి నిధులు 54 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన స్టోమ్ వాటర్ డ్రైనేజి నిర్మాణ పనులను పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ప్రజలకు అవసరం ఉన్నా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్,ఎంపీపీ బాలాజీ రావు,మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు,పట్టణాధ్యక్షుడు పారుపెల్లి గుణపతి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత-కృష్ణ, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement