Friday, May 3, 2024

ADB: బీజేపీ కే దండోరా మద్దతు.. సునీల్

చెన్నూర్, నవంబర్ 21(ప్రభ న్యూస్) : చెన్నూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దుర్గం అశోక్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు. ఇవాళ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి మోడీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తూ.. తమ వర్గానికి పూర్తి మద్దతు ఇస్తామన్న హామీని విశ్వసిస్తూ ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దుర్గం అశోక్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

దుర్గం అశోక్ సైతం గత కొన్ని ఏళ్ళుగా సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండిహెచ్ జిల్లా నాయకులు కడారి రమేష్ మాదిగ, వడ్లకొండ సంజయ్ మాదిగ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement