Tuesday, April 30, 2024

హైదరాబాద్ లో వ్యాక్సినేషన్… సీఎస్ ఎమన్నారంటే..

కోవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 100శాతం అర్హులైన వారికి చేపట్టిన కొవిడ్ వ్యాక్సిన్  కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. పదిరోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని.. అవసరమైతే పొడగిస్తామని వెల్లడించారు. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో ఇంత పెద్ద స్థాయిలో మెగా వ్యాక్సినేషన్  ప్రోగ్రాం నిర్వహించలేదని సీఎస్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement