Sunday, May 5, 2024

ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్ భేటీ

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈరోజు ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కోరగా.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని సి.ఎస్. సోమేశ్ కుమార్ వారికి హామీ నిచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి కలెక్టర్ ఆమాయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement