Saturday, May 4, 2024

తెలంగాణ‌లో క్రైమ్ రేటు పెర‌గ‌లేదు.. అదంతా అవాస్త‌వం : డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

తెలంగాణలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయ‌ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో నేరాల సంఖ్య పెరుగుతుంద‌ని మీడియాలో కథనాలు వచ్చాయి. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులు, మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయని ఆ నివేదిక వెల్ల‌డిస్తోంది. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు డీజీపీ. ప్రజల అవగాహన కోసమే కేసులు నమోదు చేసి అప్రమత్తం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. సైబర్ క్రైమ్ కేసుల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, సైబర్ నేరగాళ్లు ఝార్ఖండ్, బిహార్, బెంగాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌ నుంచి తమ కార్యకలాపాలు ఎక్కువ‌గా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement