Tuesday, May 7, 2024

గుజ‌రాత్‌లో ద‌ళితుల‌పై ఆగ‌డాలు.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం

గుజరాత్ రాష్ట్రంలో ద‌ళితుల‌పై అగ్ర‌వ‌ర్ణాల ఆగ‌డాల‌ను నిర‌సిస్తూ పెద్ద‌ప‌ల్లి జిల్లాలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆలయంలోకి దళిత మహిళలకు ప్రవేశం లేకుండా అగ్ర వర్ణాల మహిళలు అడ్డుకున్నందుకు, దళితులపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మంగళవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వ‌ద్ద టి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత వ్యతిరేకి మెాదీ అని నినాదాలు చేశారు.

కార్యక్రమం లో టి.ఆర్.ఎస్ పార్థీ సీనియర్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, కార్పోరేటర్లు దొంత శ్రీనివాస్, బాల రాజ్, కమార్, కొమ్ము వేణు గోపాల్ , నాయకులు అచ్చేవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, కలువల సంజీవ్, వడ్డెపల్లి శంకర్, నూతి తిరుపతి, ఆడప శ్రీనివాస్ , రాకం వేణు, పిల్లి రమెష్ , గంగ శ్రీనివాస్ , సలీంబెగ్, తోకల రమేశ్, యాసర్ల రాజ్ కుామార్, శ్రీనివాస్ రెడ్డి, బంధే నాగభూషణం , అల్లి గణేష్ , జడ్సన్, సట్టు శ్రీనివాస్, ఈదూనూరి అశోక్ , ఇరుగురాళ్ల శ్రావన్, కర్రి ఓదేలు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement