Friday, May 10, 2024

పాడి పశువులపై విషప్రయోగం.. 14 ఆవులలో 6 మృతి…

పాడి నమ్ముకుని జీవిస్తున్న రైతుపై గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం ద్వారా ఆరు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని భోదునం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే గ్రామానికి చెందిన పీప్పల రమేష్ పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాడు. లక్షల రూపాయలు అప్పు చేసి 14 ఆవులను కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పాడి పశువుల పాక పై విషప్రయోగం చేశారు. అందులో 6 ఆవులు మృత్యువాత పడ్డాయి. మిగతావి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికి పశు వైద్యులు వైద్యం చేస్తున్నారు. జీవనోపాధి కోసం పాడి పరిశ్రమ పై ఆధార పడుతున్న యువతకు ఇలాంటి సంఘటనలు జరగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల పై విష ప్రయోగం చేసిన నిందితుల గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement