Monday, April 29, 2024

షాడోస్ కుంగ్ ఫూ విద్యార్థులను అభినందించిన కౌన్సిలర్లు

ఈనెల 12వ తేదీన చిలకలూరిపేటలో న్యూ షావొలిన్ కుంగ్ ఫూ అకాడమీ వారి ఆధ్వర్యంలో, విక్టరీ షోటోకాన్, మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ టీమ్, నేతృత్వంలో నిర్వహించిన డా: అంబేద్కర్ మెమోరియల్ 5వ జాతీయస్థాయి, కుంగ్ ఫూ, కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో, షాడోస్ కుంగ్ ఫూ భౌరంపేట్ బ్రాంచ్ విద్యార్థులు పాల్గొని 8 బంగారు పతకాలు , 2 రజత పతకాలు, ఒక‌ కాంస్య పతకం సాధించారు. వారిని స్థానిక కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మురళీ యాదవ్, బెంబెడి బుచ్చిరెడ్డి విద్యార్థులు సాధించిన పతకాలను అందచేసి అభినందించారు. విద్యార్థులను ఎంతో చక్కగా తీర్చిదిద్దిన మాస్టర్స్ ను కొనియాడారు. వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. విద్యార్థులందరు కూడా ఇంకా కష్టపడి మరెన్నో పతకాలను సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామేశ్వరరావు, బాబీ, భూషణ్, శ్యాం, యాదయ్య గౌడ్, గోపి, దిలీప్, సోమరాజు, వంశీలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement