Thursday, May 2, 2024

చల్మెడ వైద్యకళాశాలలో కరోనా పంజా.. 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

కరోన పంజా విసిరింది. కరీంనగర్ జిల్లాలోని చెలమడ వైద్య కళాశాలలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోన సోకింది. విద్యార్థులకు లక్షణాలు ఉండడంతో యాజమాన్యం పరీక్షలు నిర్వహిస్తుండగా 43 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

స్పందించిన యాజమాన్యం కళాశాలలకు సెలవు ప్రకటించింది. వెయ్యి మంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో వైద్య విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement