Monday, April 29, 2024

కేజ్రీవాల్ ఇంటి ఎదుట సిద్దూ ఆందోళన.. ఎందుకంటే..

న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేంజ్రీవాల్ ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు సంఘీభావంగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆదివారం స్వయంగా పాల్గొన్నారు. టీచర్ల ధర్నాలో ఆదివారం సిద్దూ పాల్గొనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రంలో సొంత సమస్యలను పరిష్కరించకుండా పంజాబ్ కు వచ్చి కేజ్రీవాల్ ఉపన్యాసాలు దంచుతున్నారని, ముందు టీచర్ల సమస్య పరిష్కరించాలని ఎద్దేవా చేశారు. నవంబర్ 27న పంజాబ్లో ఇలాగే ఆందోళన చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల ధర్నాకు ఆప్ అధినేత కేజ్రీవాల్ హాజరై, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం అధికారలోకి వస్తే వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ముల్లుకు ముల్లు సమాధానం అన్నట్లు ఇవాళ ఢిల్లీలో టీచర్ల ఆందోళనకు సిద్దూ హాజరైనారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement