Friday, May 17, 2024

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. బైక్​పై వెళ్తుంటే కారు గుద్దేసింది..

కుల్కచర్ల, ( ప్రభ న్యూస్) :  వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో జరిగిన యాక్సిడెంట్​లో డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్​ చనిపోయాడు. మండల పరిధిలోని కామునిపల్లి సమీపంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న కానిస్టేబుల్ రాములును అతివేగంతో ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో రాములు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరి తెలిపారు. మృతుడు రాములు దోమ మండలం పోలీస్ స్టేషన్లో  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement