Sunday, May 19, 2024

రోడ్డు ప్రమాదంలో.. శ్రీ మేధా కాలేజ్ ప్రిన్సిపాల్ మృతి

పీలేరు, (ప్రభ న్యూస్): చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో జరిగిన ఓ యాక్సిడెంట్​లో శ్రీ మేధా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ చనిపోయారు. సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై తిరుపతికి వెళ్లి తిరుగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పీలేరుకు తిరిగి వస్తుండగా శుక్రవారం సాయంత్రం భాకరాపేట ఘాట్ లో ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో బాలకృష్ణ కు  తీవ్ర గాయాలయ్యాయి. కాగా, స్థానికులు అతన్ని తిరుపతి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని భాకరాపేట పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement