Friday, April 26, 2024

నిజామాబాద్ లో ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసనలు

తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అవమాన పరిచే విధంగా మోదీ మాట్లాడారని అని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా.. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చకుండా,కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement