Sunday, May 5, 2024

ఇబ్ర‌హీంప‌ట్నంలో రూ.221.20కోట్ల ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రూ.221.20 కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టెందుకు ప‌ర్య‌టిస్తున్న‌ మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ల‌కు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీలో ఓపెన్ టాప్ జీప్ పై ప్రజలకు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతకు అభివాదం చేస్తూ మంత్రులు కె తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి ముందుకు సాగారు. నియోజకవర్గంలోని ఆదిభట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలలో పర్యటించి రూ.221.20 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్, డిసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement